ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 75 మంది ముస్లిమ్స్ కి పద్మ అవార్డ్స్ ని ఇచ్చారని షేక్ బాజీ,బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభు త్వం పద్మ అవార్డ్స్ ని ప్రకటించటం జరిగిందని అన్ని రంగాలలో గుర్తింపు పొందిన ముస్లిమ్స్ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారన్నారు. 2024 సంవత్సరం పద్మ అవార్డ్స్ కి ఆంధ్ర రాష్ట్రం కి చెందిన ఖలీల్ అహ్మ ద్ అనే కళాకారుడిని ఎంపిక చేసారన్నారు. మతాల తో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న ప్రతి వ్యక్తి ని గుర్తించ దగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన అన్నారు. రాజ్యాంగమే నా ప్రధాన గ్రంధం అన్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన తెలిపారు. షర్మిల రెడ్డి బీజేపీ పార్టీని మత తత్వ పార్టీ అన్న వ్యాఖ్యలని ఖండిస్తున్నామన్నారు. మణిపూర్ లో జరిగిన సంఘటనలపై షర్మిల తెలుసుకోకుండా అవగా హన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. షర్మిల కి అవగాహన లేకుండా మాట్లాడటం చూసుకుంటే రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు గా కొనసాగటం దురదృష్టకరం అన్నారు. రాహుల్ గాంధీ కి తెలియక షర్మిల కి ఇలాంటి పదవి బాధ్యతలు ఇచ్చారన్నారు.
Breaking News