Chiru-Trisha : చిరంజీవి సినిమాల నిర్మాణంపై దూకుడు పెంచారు. గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరు హిట్ కొట్టాడు. అంతకు ముందు గాడ్ ఫాదర్ కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల ఎంపికలో వేగం పెంచుకున్నాడు. నాగార్జునకు బంగార్రాజు సినిమాతో హిట్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. దీంతో వీరి కాంబినేషన్ బాగుంటుందని అందరు భావిస్తున్నారు. ఇటీవల త్రిష అందం కూడా పెరుగుతోంది. అందుకే ఆమెను తెలుగులో పలు సినిమాల్లో నటించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరు త్రిషల కలయికలో మరో సినిమా రానుండటం గమనార్హం.
ఇప్పటికే చిరు భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలుగా నటిస్తోంది. ఇంకా కొత్త దర్శకులకు చిరు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి కథలతో వస్తే అవకాశమివ్వడానికి తాను రెడీ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త వారు చిరు కోసం పలు కథలు సిద్ధం చేస్తున్నారు. దీంతో చిరు తన సినిమాల ఎంపికలో దూకుడు పెంచడంతో ఇంకా పలు సినిమాలు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
కల్యాణ్ కృష్ణ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ చిరుకు తమ్ముడిగా చేస్తున్నాడు. మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. మళయాళ చిత్రం బ్రో డాడీ మూవీకి రీమేక్ గా నిర్మిస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో చిరు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియడం లేదు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ చిరు వేగం పెంచడంతో సినిమాల సంఖ్య పెరుగుతోంది.