India vs Pakistan: వరల్డ్ కప్ కు ముందు భారత్, పాక్ తో పాటు మరికొన్ని దేశాలు ఏషియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఆసియా కప్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది గేమ్ ఏదంటే భారత్-పాక్ మ్యాచ్ అనే అందరూ చెప్తారు. అయితే ఈ మ్యాచ్ ఇటీవల వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇటు భారత్ కాకుండా పాక్ తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల క్రికెట్ లవర్స్ నిరశ చెందారు.
భారత్-పాక్ మ్యాచ్ అంటేనే వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంటుంది. రెండు దాయాది దేశాలు గ్రౌండ్ లో తలపడే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ రెండు జట్లు మరో సారి తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూపర్-4లో ఈ నెల 10 (ఆదివారం)వ తేదీ భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఉంది. అయితే ఈ సారి కూడా వర్షం వల్ల అంతరాయం కలిగితే ఎలా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వారికి ఏసీసీ తీపికబురు చెప్పింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే తర్వాతి రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పింది. కాగా సూపర్-4లో మిగతా మ్యాచ్ లకు రిజర్వ్ డే లేదు. ఒక్క ఇండియా పాక్ కు మాత్రమే ఈ అవకాశం కల్పించారు.