17.9 C
India
Tuesday, January 14, 2025
More

    అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

    Date:

    Telangana student died in america
    Telangana student died in america

    ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన తెలంగాణ స్టూడెంట్ అఖిల్ సాయి మృత్యువాత పడ్డాడు. గత ఏడాది కిందట ఎమ్మెస్ చేయడానికి వెళ్ళాడు. అఖిల్ సాయి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధిర కు చెందిన వ్యక్తి. అఖిల్ సాయి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్తానంటే కొడుకు మరింత ప్రయోజకుడు అవుతాడు కదా అని పంపించారు.

    అయితే ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడట అఖిల్ సాయి. కాగా ఆ గ్యాస్ స్టేషన్ లో సెక్యూరిటీ గార్డ్ దగ్గరున్న గన్ ను చూస్తుండగా అది మిస్ ఫైర్ అయినట్లు మొదట సమాచారం ఇచ్చారట పేరెంట్స్ కు. అఖిల్ సాయి తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడు.

    దాంతో అఖిల్ సాయి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. వాళ్ళను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైన రీతిలో దర్యాప్తు చేసి అఖిల్ సాయి మృతికి కారణాలు తెలుసుకోవాలని , దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిల్ సాయి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Maha Kumbh Mela : మహా కుంభమేళా: త్రివేణీ సంగమంలో విదేశీయుల స్నానాలు

    Maha Kumbh Mela : మహా కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులూ ఎక్కువగానే...

    Bhogi celebrations : భోగి సంబరాల్లో MLC కవిత, మంచు ఫ్యామిలీ, రోజా

    Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి...

    Rain alert : మూడు రోజులు వర్షాలు

    Rain alert : AP: ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు...

    Water Supply : నేడు, రేపు వాటర్ బంద్

    Water Supply : నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related