YCP Another MLA Resigns : వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ లేదని బయటికి పంపిం చేశారని కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచే శారు. జగన్ అవకాశం ఇవ్వకపోతే తాను ఇండిపెం డెంట్ అభ్యర్థిగా రాయదుర్గంలో పోటీ చేస్తానని నా భార్య కళ్యాణదుర్గంలో పోటీ చేస్తుందని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తం మీద అభ్యర్థుల మార్పుతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నియోజ కవర్గాలలో బలంగా ఉన్న నేతలకు మరోసారి టికెట్ నిరాకరించడంతో వారు అసంతృప్తిలో ఉన్నారు. జగన్ టికెట్ ఇవ్వకపోతే మేము రాజకీయాలు ఎలా మానుకుంటామని ఇండి పెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మా సత్తా ఏంటో చూపిస్తామని కొందరు ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఈరోజు కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం కూడా వైసీపీ పెద్దలను కలుసుకున్నారు. మరోసారి తనకు ఆలూరు నుంచి టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎవరు సీటు ఉంటుందో ఎవరు సీటు ఊడిపోతుందోనన్న భయంతో వైసిపి ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.