Karnataka : వయసు మీద పడింది. ఆలనా పాలన చూసేవారు ఎవరు లేరు. జీవనాధారమైన పింఛను డబ్బు 2 నెలలుగా రావడం లేదు. అడిగితే పోస్ట్ మెన్ విసుక్కోవడంతో ఆ వృద్ధురాలు ఎవరికి చెప్పాలి అర్థం కాక పోస్ట్ ఆఫీస్ కి బయలు దేరింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు దాదాపు 8 గంటల పాటు దోగాడుతూ వెళ్ళింది.. దీంతో కాళ్లకంతా తీవ్రగాయాలయ్యాయి. కర్ణాటకలోని దావనగేరె జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ కలిసివేసింది. ఎంతో కష్టంతో కాళ్లు సహకరించకపోయిన ధోగాడుతూ ఆఫీస్ కు వచ్చిన ఈ వృద్ధురాలికి అధికారులు వైద్యం చేయించి ఆమె సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు.
Breaking News