YCP Campaign : వైసిపి నేతల ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలనే తపనతో విచిత్ర ప్రచారాలకు పూనుకుంటోంది. తాజాగా తోపుడు బండ్ల పై వైసీపీ జెండా కలర్ ల తో పాటు జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని కూడా ఏర్పా టు చేయడంతో పలు విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి ప్రభుత్వం మాత్రం వింత ప్రచారం చేసుకుంటూ విమర్శలకు ఎదుర్కొంటుంది. ఎక్కడ ప్రచారం చేసుకోవాలి ఎక్కడ చేసుకోకూడదు అన్న మినిమం అవగా హన లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోపుడు బండ్లకే కాదండోయ్.. ప్రభుత్వ కార్యాలయంలో కూడా వైసిపి జెండా కలర్లు వేయడంతో గతంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం పై ప్రతిపక్ష పార్టీ నేతలు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం ఆ కలర్లను మార్చే ప్రయత్నం చేసింది.
సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ జెండాను ప్రభుత్వ కార్యాలయాలకు వేయకూడదు. అయితే ఏపీలో మాత్రం అలా కాదు ప్రచారం అనే పిచ్చిలో ఎక్కడపడితే అక్కడ వైసిపి జెండాలు వేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయడం పరిపా టిగా మారింది. ఇప్పుడు తోపు డుబండ్లకు అదే విధంగా సర్వే నెంబర్ రాళ్ల కూడా వైసిపి జెండా కలర్లను వేస్తున్నారు. సర్వే నెంబర్ రాళ్ళకు వైసీపీ జెండా కలర్ ఎందుకు వేస్తు న్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. మొత్తం మీద వైసిపి ప్రచార పిచ్చి ఇకమీ దట ఏ స్థాయికి వెళ్తుందోనని అందరూ తలలు పట్టుకుంటున్నారు.