38.3 C
India
Sunday, May 5, 2024
More

    Yuvagalam Padayatra : యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్.. రంగంలోకి బ్రాహ్మిణి..?

    Date:

    Yuvagalam Padayatra :
    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ముందుగా పాదయాత్రను నిలిపివేశారు. విజయవాడకు చేరుకొని తండ్రిని కలుసుకున్నారు. అనంతరం తండ్రిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తర్వాత నారా లోకేశ్ ఢిల్లీలో మకాం వేశారు. జాతీయ నాయకులతో పాటు జాతీయ మీడియాతో ఏపీ ప్రభుత్వ ఆగడాలను వివరించే ప్రయత్నించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ కేసు నడుస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు.
    ఇక రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఏపీ సీఐడీ లోకేశ్ ను చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు లో పిటిషన్ వేసినా లోకేశ్ కు ఊరట లభించలేదు. దీంతో మరికొన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక ఈ క్రమంలో యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. అయితే లోకేశ్ అరెస్టు కూడా తప్పదనే ఊహాగానాల నేపథ్యంలో పాదయాత్రను కొనసాగించేందుకు బ్రాహ్మిణీని రంగంలోకి దించాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. ఆమెను ఇప్పటికే మానసికంగా సంసిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నది. ఇందు కోసం ముఖ్యనేతలతో పాటు మరికొందరు ఆమెకు పలు సూచనలు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది.
    అయితే ముఖ్యనేతలిద్దరూ అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అక్టోబర్ మొదటివారంలో చంద్రబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించకపోతే ఎలా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే నారా లోకేశ్ అరెస్ట్ అయితే బ్రాహ్మిణి, భువనేశ్వరిలను రంగంలోకి దించాలని టీడీపీ భావిస్తున్నది. టీడీపీ ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎన్నో ఎదుర్కొందని, పార్టీ మళ్లీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. ఇక ఏపీ సీఐడీ మాత్రం లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లి అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఏపీలో తర్వాతి పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...