BRS MLA : బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీంతో తెల్లం పార్టీ మారుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరు అందుకుంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఇతర నిధులతో పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే.
ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు క్యు కడుతున్నారు. కీలక నేతలు పార్టీని రీడింగ్ కాంగ్రెస్ లోకి వెళ్తుండడంతో BRS లో అలజడి మొదలైంది. నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు.