Big Boss 7 Telugu :
బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయినా తెలుగులో మంచి రెస్పాన్స్ నే అందుకుంటుంది. గత సీజన్ మినహా అన్ని సీజన్స్ సక్సెస్ కొట్టాయి. ఇక 7వ సీజన్ ఇటీవలే స్టార్ట్ అయ్యిన విషయం విదితమే.. ప్రస్తుతం సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో 4వ వారం స్టార్ట్ అయ్యి ఆసక్తికరంగా ముందుకు వెళుతుంది.
ఇక నిన్నటి ఎపిసోడ్ వీకెండ్ కావడంతో నాగార్జున వచ్చారు.. ఎప్పటిలాగానే శనివారం ఎపిసోడ్ లో అందరికి పీకారు.. మరి శనివారం రోజు బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకున్న హైలెట్స్ ను ఒక్కసారి పరిశీలిద్దాం.. ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురు ఎలిమినేట్ కాగా 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఇంటి సభ్యులలో ముగ్గురికి పవర్ అస్త్రా లభించడంతో ఆ ముగ్గురు ఇంటి సభ్యులుగా ఉన్నారు.
ఇక 4వ పవర్ అస్త్రా కోసం నాల్గవ వారంలో పోటీ జరిగింది. ఈసారి రైతు బిడ్డ పవర్ అస్త్రాను సాధించి బిగ్ బాస్ సభ్యుడిగా అర్హత సాదించుకున్నాడు. స్వయంగా నాగార్జుననే ఇతడికి పవర్ అస్త్రాను ప్రకటించారు. పల్లవి ప్రశాంత్ ఫైనల్ కు చేరుకోవడంతో ఈయన కంటే బయట ఉన్న ఆయన ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో అందరికి ఒక రౌన్డ్ వార్ణింగ్ ఇచ్చారు. స్మైలీ టాస్క్ లో తేజ తీరుపై సీరియస్ అయ్యారు. చేతిలో బెల్ట్ పట్టుకుని నాగార్జున హౌస్ మేట్స్ కు కనిపించారు.. ఇక ఈ టాస్క్ లో సంచారకులుగా వ్యవహరించిన శివాజీ, సందీప్ లను కూడా గట్టిగ ఏసుకున్నారు.. ఇక తేజకు జైలు శిక్ష వేశారు.. అలాగే గౌతమ్ చెప్పిన పనులు చేయడంతో పాటు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్స్ లో ఉంచుతున్నట్టు తెలిపాడు.
ఆ తర్వాత శివాజీ, శుభశ్రీ ఘటనపై కూడా స్పందించారు. ఈ ఘటనలో ఇద్దరిది తప్పు కాదని కానీ లేడీస్ కు గౌరవం ఇస్తూ సైలెంట్ గా ఉండాల్సింది అంటూ తెలిపారు.. శోభా శెట్టి ఫిజిక్ గురించి గౌతమ్ ప్రవర్తించిన తీరు తప్పు అని అన్నారు..