BRS Sensational : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొద్ది వారాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలు జరగనున్నాయి. పొలిటికల్ పిక్చర్ చూస్తుంటే రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల మూడ్ ను అంచనా వేస్తూ సర్వేలు వస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా ఓ సర్వేలో బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 72 నుంచి 75 సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. ఓటింగ్ శాతంలో అయినా, గెలిచే సీట్ల సంఖ్యలో అయినా సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఇతర పార్టీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
‘జనతా కా మూడ్’ పొలిటికల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వేలో భారత్ రాష్ట్ర సమితికి 41 శాతం ఓట్లు వస్తాయని, 72 నుంచి 75 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతర పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ కు 34 నుంచి 31 శాతం, బీజేపీకి 36 శాతం, ఎంఐఎంకు 14 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
భారత్ రాష్ట్ర సమితి 72 నుంచి 75, కాంగ్రెస్ కు 31 నుంచి 36, ఎంఐఎం, బీజేపీకి పదిలోపే సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఈ సర్వే బీఆర్ఎస్ మద్దతుదారులను సంతోషపెడుతోంది. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని అధికార పార్టీ చెబుతోందని, ఆ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది.