హార్దిక్ పాండ్యా సంగతి అలా ఉంచితే రోహిత్ శర్మ 2013 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ జట్టకు 5 టైటిళ్లను సాధించి పెట్టిన ఘనత కూడా అతడిదే. ఐపీఎల్ లో గొప్ప కెప్టెన్ గా పేరురావడంతో టీమిండియా పగ్గాలు కూడా అప్పగించారు. దాన్ని కూడా రోహిత్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎన్నో విజయాలతో భారత్ ను నంబర్ వన్ గా నిలిపాడు. కానీ అనూహ్యంగా ముంబై జట్టు రోహిత్ స్థానంలో హార్దిక్ ను తీసుకురావడంపై అభిమానులను షాక్ కు గురిచేసింది.
అయితే ఫ్యూచర్ లో ఎప్పటికైనా హార్దిక్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అవుతాడనే అంతా భావించారు. ఉన్నట్టుండి రోహిత్ ను పక్కనపెట్టి హార్ధిక్ ను కెప్టెన్ చేయడంపైనే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. కెప్టెన్సీ పోవడంతో రోహిత్ ఇక ఐపీఎల్ కు గుడ్ బై చెపుతారని చర్చ నడుస్తుండడంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ గుండెలు పగులుతున్నాయి.
ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ మాత్రం సమర్థించుకుంటోంది. హెడ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేలా జయవర్ధనే మాట్లాడుతూ.. భవిష్యత్ కు ముంబైని రెడీ చేయడంలో ఇది భాగం. గతంతో సచిన్ నుంచి హర్భజన్ కు, రికీ నుంచి రోహిత్ ఈ బదలాయింపు జరిగింది. వారందరూ ముంబైకి ఎన్నో విజయాలు, పేరు సాధించి పెట్టారు. ఇప్పుడదే ఉద్దేశంతో 2024 సీజన్ కు హార్దిక్ కెప్టెన్సీ వహిస్తారు’’ అని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ముంబైని మరింత బలోపేతం చేయడానికి రోహిత్ గైడెన్స్, అనుభవం మైదానం లోపల, వెలుపల ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.