ED notices to Kavitha : దేశంలో సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణ ఇంకా సాగుతూనే ఉంది. పలుమార్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోమారు ఆఫీసుకు రావాలని సూచించింది. దీంతో కేసులో మళ్లీ కదలిక వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లు కేసు పని అయిపో యిందని అంతా అనుకుంటున్న సమయంలో కవితను విచారణకు హాజరు కావాలని చెప్పడం గమనార్హం.
కేసుపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు, ధర్నాలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై నేరారోపణ చేయడం ఆశ్చర్యంగా ఉందని గగ్గోలు పెట్టారు. చివరకు ఏమైందో ఏమో కానీ కేసు ఊసు లేకుండా పోయింది. కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న కేసు విషయంలో ఇప్పుడు మళ్లీ కదలికలు రావడం విశేషం. ఇందులో ఆప్ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా జైలులోనే ఉన్నారు.
దీంతో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటాను పరిశీలించారు. అందులోని సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితను ఈడీ ఆఫీసు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. మళ్లీ కేసు విచారణ ముందుకు వెళ్తుందా? రాజకీయంగా ముందుకు నడుస్తుందా? లేదా అనేది సందేహమే.
మొత్తానికి లిక్కర్ కుంభకోణం ఎంతకూ తెగడం లేదు. విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే వదంతులు కూడా వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు కానీ కేసు ఇన్ని రోజులు ముందుకు సాగలేదు. ఇప్పుడు కవితను విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో కదలిక వస్తుందని అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.