SS Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలితో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి మన ప్రతిష్టను మరింత పెంచాడు. తన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేయడానికి అందరు సిద్ధంగా ఉంటున్నారు. ఇక మహాభారతాన్ని పదిభాగాలుగా తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో ఏకంగా నలుగురు ప్రముఖ హీరోలు నటిస్తున్నారని సమాచారం.
ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని రాజమౌళి ఇదివరకే ప్రకటించాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో టాలీవుడ్ అగ్రహీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. మహాభారతం సినిమా నిర్మాణానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. తన కలల ప్రాజెక్టుగా దీన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
వారి క్యారెక్టర్లు కూడా డిసైడ్ అయ్యాయి. కర్ణుడిగా ప్రభాస్, క్రిష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడిగా రాంచరణ్, భీముడిగా ఎన్టీఆర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ కు కూడా ఓ పాత్ర ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో తెలుగు సినిమా నటులు ఒకే సినిమాలో కనిపించడంతో అభిమానులకు పండగే కానుందని తెలుస్తోంది.
రాజమౌళి తనదైన శైలిలో నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మహాభారతం అంటే మామూలు సినిమా కాదు. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాత్రల రూపకల్పనలో రాజమౌళి తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నారు. భారీ ప్రాజెక్టుగా తెరకెక్కే మహాభారతం నిర్మాణం ఓ అద్భుత కల అని తెలిసిందే.