Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సిరీస్ పుష్ప ఇప్పటికే ఫస్ట్ పార్ట్ పూర్తికాగా.. సెకండ్ పార్ట్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. పుష్ప-2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.
ఫస్ట్ పార్ట్ కు ఒక రేంజ్ స్పందన రావడంతో దాని కంటే వంద రేట్ల ఎక్కువగా సెకండ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా గ్లిప్స్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనికి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ అప్డేట్ తర్వాత పుష్ఫ: ది రూల్ పై ఒక్కసారిగా అంచనాలు డబుల్ అయ్యాయి.‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇక, ఈ సినిమా నుంచి ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ ఇంటర్వెల్పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథ ప్రకారం చనిపోయాడునుకున్న పుష్పరాజ్ ఇంటర్వెల్ సమయంలో బిగ్ ట్విస్ట్ ఇస్తాడట. అంతేకాదు రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ కూడా సీక్వెన్స్ లోనే రివీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇలా సుకుమార్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పుష్ప-2ను ప్లాన్ చేశారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్, లేదంటే వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ కు కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. ఇక పుష్ప-1ను మించిన కాస్టింగ్ సుకుమార్ యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. చూడాలి మరి ఈ మూవీ అభిమానుల అంచనాలను ఏ మేరకు నిలబెడుతుందో..