Grand Finale Leak : బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రేపు(ఆదివారం) జరగబోతోంది. ఈ మెగా ఫినాలేకు నిర్వాహకులు ఓ రేంజ్ లో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అన్ని సీజన్లలో కెల్లా ఈ సీజన్ దుమ్మురేపిందనే చెప్పాలి. గతంలో కంటే ఎక్కువగా రేటింగ్ వచ్చింది. ఈ సీజన్ పై జనాల ఇంట్రెస్ట్ ను బట్టి నిర్వాహకులు కూడా ఫైనల్ ను భారీ ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ ను షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిని ఎవరికీ వారు న్యూస్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు.
లీక్ వీడియోలను బట్టి.. ఫినాలే లో ముగ్గురు, నలుగురు సభ్యులు హౌజ్ లో ఉన్నప్పుడు హోస్ట్ నాగార్జున కొందరు గెస్ట్ లను లోపలికి పంపిస్తారు. హౌస్ మేట్స్ కు ఆశ చూపించి ఎవరో ఒకరిని తప్పుకునేలా టెంప్ట్ చేసే సీన్ కనపడుతోంది.
గతంలో జరిగిన ఫైనల్స్ ను గమనిస్తే.. ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయిన తర్వాత ఇలా డబ్బు ఆశ చూపడం జరిగేది. కానీ ఈ సీజన్ లో ఫినాలే ఆరంభం నుంచే డబ్బు ఆశ చూపి వారిని టెంప్ట్ చేసేలా రూపొందించడంతో షో అద్యంతం రక్తికట్టేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే.. యాంకర్ శ్రీముఖి బిగినింగ్ లోనే హౌస్ లోకి వెళ్తుంది. ఆమెతో పాటుగా రూ.20లక్షల నగదు ఉన్న సూట్ కేసును లోపలికి తీసుకెళ్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరు ఫినాలే వరకు కొనసాగుతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరిగినా.. అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.
హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ కు శ్రీముఖి రూ.20లక్షల డబ్బు ఆశ చూపించింది. ఎవరైనా డ్రాప్ అయితే ఆ డబ్బులు వారి సొంతం అవుతాయని వారిని టెంప్ట్ చేసింది. కానీ ఆ డబ్బు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. శ్రీముఖి ఆఫర్ ను అందరూ రిజెక్ట్ చేశారు. ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నామని అనుకునేవారికి గోల్డెన్ ఆపర్చునిటీ అంటూ మరింతగా కవ్విస్తుంది. అయినా కూడా కంటెస్టెంట్స్ ఎవరూ వాటిని తీసుకోవడానికి ముందుకు రాలేదు.
అయితే ఈ లీక్డ్ వీడియోను బట్టి ఫినాలే స్టార్టింగ్ లోనే ఇంత హైప్ తేస్తే.. చివరి వరకు ఇంకెన్ని ట్విస్ట్ లు ఉంటాయోనని ఆడియన్స్ లో టెన్షన్ పెరుగుతోంది. ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ లో ఇంకెన్నీ ఆఫర్లు ప్రకటిస్తారో చూడాలి. విన్నర్ కు ఎంత మనీ ఇస్తారో అనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ మధ్య విన్నర్ ఎవరు అవుతారోననే ఆడియన్స్ కు తీవ్ర ఉత్కంఠగానే ఉంది. ఇక పలు మీడియా సంస్థలు చేసిన సర్వేల ప్రకారం.. శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్య టైటిల్ పోరు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముగ్గురిలో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే తెలుగు ఆడియన్స్ కు ఈ సండే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయం.