soft drinks : శీతల పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పే. దీని వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. ఇందులో పురుగుల మందు, చక్కెర ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. కానీ ఎవరు కూడా లెక్కచేయడం లేదు. ఫలితంగా ఆయుర్దాయం తగ్గుతుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మరణం కూడా త్వరగా సంభవిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ్రాన్స్ లో జరిపిన పరిశోధనల్లో దాదాపు 40 శాతం మంది క్యాన్సర్ వల్ల 20 శాతం మంది క్యాన్సర్ వల్ల 9 శాతం మంది రక్తప్రసరణ సమస్యల వ్ల చనిపోయారు. దీంతో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల డయాబెటిస్ సంభవిస్తుంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా శీతల పానీయాలు మనకు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి.
చక్కెర, సోడాలు శరీరానికి ఎంతో కీడు చేస్తున్నాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదముంటుంది. దీని వల్ల అనేక ఇబ్బందులు వచ్చే సూచనలున్నాయని వైద్యులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రోజుకు రెండు గ్లాసుల కూల్ డ్రింక్ తాగితే అనర్థాలు పెరుగుతాయి. అందరికంటే ముందే మరణం సంభవిస్తుంది.
కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాం, జ్యూస్, చెరుకు రసం వంటివి తీసుకోవడం ఉత్తమం. శీతల పానీయాలు తాగితే కిడ్నీ జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే కూల్ డ్రింక్స్ ను దూరం చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ముట్టుకోకూడదు. తీసుకుంటే మన పతనం మనమే తెచ్చుకున్నట్లు అవుతుంది.