mahesh babu టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఏ సినిమా చేసిన సంచలనమే అని చెప్పాలి.. ఇక ఇప్పుడు ఈయన టాలీవుడ్ లో మరో మోస్ట్ ఏవైటెడ్ కాంబోను సెట్ చేసాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఈ క్రమంలోనే ఈయన చేయబోతున్న నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.
ప్రజెంట్ జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ వర్క్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు కూడా గ్లోబల్ స్టార్ గా మారిపోయే ఛాన్స్ రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.
ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని ముందుగా అనుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ నే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి ఫుల్ గా రాజమౌళి ప్రాజెక్ట్ కోసం డేట్స్ ఇచ్చేయనున్నాడు.
రాజమౌళి మూవీ అంటే హీరోలు ఫుల్ అటెన్షన్ గా ఉండాలి.. ఆయన చెప్పినట్టుగా వర్కౌట్స్ చేయాల్సిందే.. ఇప్పుడు మహేష్ వంతు రావడంతో ఈయన కూడా సిద్ధంగా ఉన్నాడు.. ఇప్పటి వరకు మహేష్ సున్నితమైన సబ్జెక్ట్స్ మాత్రమే టచ్ చేస్తూ వచ్చాడు. కానీ జక్కన్న విషయంలో అలా కుదరదు.
అసలే ఈ సినిమా అడవుల నేపథ్యంలో ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర రానటువంటి యాక్షన్ ఇందులో చూపించనున్నారు.. ఈ మూవీ కోసం మహేష్ మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకొమ్మని చెప్పారట.. ఆ ప్రాసెస్ ను కూడా తనే అరేంజ్ చేసారని ఈ మేరకు నవంబర్ నుండి ట్రైనింగ్ తీసుకోనున్నారని టాక్.. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయితే అప్పుడు సెట్స్ మీదకు వెళతారట..