delhi liquor scam కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు ప్రకంపనలు సృష్టించింది. పలువురు ప్రముఖుల పేర్లు ఇందులో వినిపించడమే కారణమైంది. ఢిల్లీ నుంచి మొదలుకొని ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ప్రభుత్వాల్లో కొందరు కీలక వ్యక్తులకు ఇందులో పాత్ర ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ మేరకు ఈడీ పలువురిని పిలిచి విచారించింది. మరికొందరిని అరెస్ట్ చేసి, కటకటాల పాలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఢిల్లీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను వణికించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీశ్ సిసోడియాల తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైసీపీ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈడీ ఇక వీరందరినీ అరెస్ట్ చేయబోతున్నదని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇందులో సీఎం కేజ్రివాల్, ఎమ్మెల్సీ కవితను మినహా అందరినీ అరెస్ట్ చేశారు. ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసింది. కవితను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని లీకులు ఇచ్చారు. ఆమెను మూడుసార్లు ఢిల్లీకి పిలిచి విచారించారు. ఇక రేపో, మాపో అరెస్ట్ అన్నట్లుగా నే హడావుడి చేశారు. ఇక మీడియాలో ఓ వర్గం వారికైతే వార్త కథనాలకు కొదవ లేకుండా చేశారు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా ఈడీ రూట్ మారింది. దర్యాప్తు వేడిని తగ్గించింది. తాజాగా వైసీపీ నేత మాగుంట రాఘవను బెయిల్ పై రిలీజ్ చేసింది. ఇక కవిత కూడా ఈ వ్యవహారంలో సేఫ్ జోన్ కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఇందులో కీలకంగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్, మంత్రి మనీశ్ సిసోడియా మెడకు చుట్టేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. అయితే కేంద్రంతో సీఎం కేసీఆర్ సయోధ్య వల్లే ఇక కవితపై ఆరోపణలు తగ్గించింది. దీంతో పాటు ఏపీ సీఎం జగన్ కూడా ఈ వ్యవహారంలో కేంద్రంతో మాట్లాడి సయోధ్య కుదిర్చినట్లు టాక్.