NRI TDP and Janasena Meeting : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు విదేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సభ్యులతో వర్చువల్ గా సత్యమేవ జయతే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు ఎన్నారై టిడిపి సెల్ కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, గల్ఫ్ లోని వివిధ దేశాల ఎన్నారై టిడిపి అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు, ఇతర దేశాల ఎన్నారై టీడీపీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గల్ఫ్ దేశాల్లోని జనసేన జాతీయ కన్వీనర్స్, ప్రాంతీయ కన్వీనర్స్ కూడా పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. ఎన్నారై తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పట్టాభిరామ్ మాట్లాడుతూ.. చంద్రబాబు మచ్చలేని నాయకుడని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన 39 పేజీల చంద్రబాబు బెయిల్ రిపోర్ట్ లో వైసీపీ చేసిన ఆరోపణలు నిరాదారమైనవని స్పష్టంగా వివరించబడిందన్నారు.
కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్ రావు, ఎన్నారై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్ ఆళ్ల, గొట్టిపాటి రమణయ్య, మహమ్మద్ ఇమామ్, అక్కిలి నాగేంద్రబాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ మలిరెడ్డి, ఖాదర్ బాషా, హరిబాబు తక్కెళ్లపాటి పాల్గొన్నారు.