TDP NRI : 2024 ఎన్నికలకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. ఎన్ఆర్ఐ డల్లాస్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ప్లేనోలో సన్నాహక సదస్సు నిర్వహించింది. మన రాష్ట్రం మన భవిష్యత్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో వచ్చే ఎన్నికల గురించి పార్టీ ఎలా ముందుకెళ్లాలనే దానిపై కావాల్సిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపై చర్చ జరగాలని భావించారు. దాని గురించి అందరు మూకుమ్మడిగా చర్చించుకున్నారు.
అమెరికాలోని ప్రవాసాంధ్రులు అంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూలంకషంగా చర్చించనున్నారు. అధికార మార్పిడి రాష్ట్రంలో అత్వవసరంగా గుర్తిస్తున్నారు. దీని కోసం అందరు ఏకతాటిపై నిలవాలని అనుకున్నారు. మూకుమ్మడిగా పనిచేసి బాబు గెలుపుకు పాటుపడాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన అస్తవ్యస్తంగా మారింది. పనులు సజావుగా సాగకుండా రౌడీయిజం ప్రదర్శిస్తున్నారు. అడ్డం వచ్చిన వారిని అంతం చేస్తున్నారు. ఇలా రాష్ర్టంలో జగన్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. జగన్ ను గద్దె దించి చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. టీడీపీ అధికారంలోకి రావాలని అహర్నిశలు లేకుండా పని చేస్తామని అన్నారు. దీనికి ఎన్ఆర్ఐలు తమ వంతు ప్రచారం నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఏపీలోని ప్రజలను చైతన్యవంతులను చేసి టీడీపీ అధికారంలోకి వచ్చేలా చేయాలని భావిస్తున్నారు.