NRI Jayaram: ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా మహానాడు కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జయరాం మాట్లాడుతూ రాజమండ్రిలోనే కాదు అమెరికాలో 60 సిటీల్లో ఇదే సమయంలో అన్నగారి శతజయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. న్యూయార్క్ లోని టైం స్క్వేర్లో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఎన్టీఆర్ ప్రతిబింబం కనిపించేలా ఏర్పాటు చేశాం. ఇది వీకెండ్ కావడంతో చాలా మంది తెలుగు వాళ్లు అక్కడికి చేరుకుంటున్నారు. మా అందరికీ తెలుగుదేశం, అన్నగారు, మాతృభూమి మీద ఉన్న అభిమానంతోనే ఇక్కడికి వచ్చాం అని తెలిపారు.
40 ఏండ్లుగా అమెరికాలో ఉన్నా తెలుగుదేశం పిలుపునిచ్చే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా అమెరికా నుంచి 100 మంది ఎన్ఆర్ఐలు విచ్చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్నారు. మేం ఎక్కడ పనిచేస్తున్నా మేం పుట్టిన గడ్డ ఏపీ బాగుండాలని ఆలోచిస్తుంటాం.
నారా చంద్రబాబునాయుడిని మళ్లీ సీఎంగా చేయాలని, మేమంతా కంకణబద్దులమైం ఉన్నాం. ఇదంతా ఆరంభం మాత్రమేనని, ఎన్ఆర్ఐలం తెలుగు దేశానికి అండగా ఉంటామని తెలిపారు. ఎన్ఆర్ఐలు మోహన్ మన్నవకృష్ణ, రవి మందలపు, పైల ప్రసాద్, కృష్ణ గంప, సుధాకర్ కంచర్ల, సురేశ్ కాకర్ల, మల్లిక్ మెదరమెట్ల, లాంటి ఎన్ ఆర్ఐలు తెలుగు దేశం, ఏపీ మీద గౌరవం, అభిమానంతో ఇక్కడికి వచ్చాం. నారా చంద్ర బాబునాయుడి గారికి మాత్రమే ఏపీని బాగు చేసే సత్తా ఉందని నమ్ముతున్నాం. ఆయన గెలుపునకు 2024 మేమంతా కలిసికట్టుగా సహకరిస్తాం. రాష్ర్ట ప్రయోజనాల రీత్యా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది.