PM Narendra modi : ప్రధాని నరేంద్ర మోడీ 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ కు చేరుకొని అక్కడి నుంచి వరంగల్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మోడీ పర్యటనను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాబట్టి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలికే అవకాశం లేదు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటనకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు రూ.20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వగా, తెలంగాణకు తక్కవ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యత్యాసం ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణను సవతి తల్లిలా చూస్తుందని ఆయన ఆరోపించారు.
కొత్త రాష్ట్రం, పైగా అన్ని వణరులు ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను గుజరాత్ కు తీసుకెళ్లాడని ఆరోపించారు. మద్దతు లేకపోయినా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా అభివర్ణించిన కేటీఆర్, రేవంత్ కు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రానికి మద్దతివ్వడం లేదని ప్రధాని మోదీని విమర్శించడం మనం ఎప్పుడైనా విన్నామా, చూశామా? రెండు జాతీయ పార్టీలు విఫలమయ్యాయని, ప్రజా అనుకూల ప్రభుత్వమైన టీఆర్ ఎస్ పార్టీని అనవసరంగా నిందిస్తున్నాయని మండిపడ్డారు.
ReplyForward
|