Prabhas created : టాలీవుడ్ లో బడా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు.. ఈయన బడా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ బాగానే కష్టపడ్డాడు.. ఇప్పుడు ఏ హీరో అందుకొని లెవల్ కు చేరిపోయాడు.. ఇతడు టాలీవుడ్ లో అందరి కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు.. బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు..
ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ఈ సినిమా ఈ నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
మరో మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. టి సిరీస్ సంస్థ పై ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మరి అదే రేంజ్ లో బిజినెస్ కూడా చేసింది.. భారీ హైప్ పెరగడంతో థియేట్రికల్ హక్కులకు డిమాండ్ గట్టిగా ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మొత్తం ఏరియాలు కలుపుకుని 430 కోట్లకు పైగానే బిజినెస్ జరిగినట్టు తాజా సమాచారం..
బాహుబలి 2 సమయంలో ఈ సినిమా 122 కోట్ల మేర బిజినెస్ చేయగా అప్పట్లోనే కొత్త రికార్డును సృష్టించింది. ఇక సాహో కూడా 121.60 కోట్ల బిజినెస్ చేసింది. సాహో హిట్ అవ్వకపోవడంతో ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కాస్త డిమాండ్ తగ్గి 105 కోట్లతోనే సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ మాత్రం మళ్ళీ పుంజుకుని 120 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.
ఈయన నటించిన గత నాలుగు సినిమాల రికార్డ్ చూసుకుంటే 468.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. ఇలా ఈ రికార్డ్ సృష్టించిన ఏకైక హీరో ప్రభాస్ కావడం ఇప్పుడు ఫ్యాన్స్ లో మంచి వైరల్ అవుతుంది. మరి గత రెండు సినిమాల మాదిరిగా కాకుండా ఆదిపురుష్ అయిన హిట్ అందిస్తుందో లేదో చూడాలి.. మరో నాలుగు రోజులు ఎదురు చుస్తే ఈ సినిమా రిజల్ట్ కూడా తేలిపోతుంది.