Rikshawala Advice :
ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంగానే కాకుండా అధ్యాత్మిక కేంద్రంగా వారణాసికి మంచి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వారణాసికి వచ్చి వెళ్తుంటారు. అయితే గత కొంతకాలంగా ప్రధాని మోదీ ఇక్కడి నుంచి లోక్ సభకు ఎంపికవుతూ వస్తు్న్నారు. అయితే పేదలకు రేషన్ కు సంబంధించి , ఓ రిక్షావాలా ప్రధానికి సలహా ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ పర్యాటకుడు ఈ వీడియో తీసి నెట్ లో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతున్నది.
ఆ వీడియోలో ఉన్న ప్రకారం రిక్షావాలా తన రిక్షాలో ప్రయాణిస్తున్న పర్యాటకుడితో మాట్లాడుతున్నాడు. పేదలకు అందించే రేషన్ ను ఎలా ఇవ్వాలనే దానిపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నాడు. ప్రధాని మోదీ అధికారంలో కి వచ్చాక చాలా మార్చేశారు. ఆయనకు ఏదైనా అసాధ్యమే. రేషన్ విషయంలో కూడా ఆయన ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ముందుగా వృద్ధులకు, అవయవాలు లేని వారికి ఈ రేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత తక్కువ సంపద ఉన్న నాలాంటి వారికి ఈ రేషన్ సరుకులు పక్కాగా ఇవ్వాలి. ఉన్నవారికి కూడా ఇస్తే ఈ రేషన్ దుర్వినియోగమే కదా అంటూ సలహా ఇచ్చారు. ప్రధాని మోదీ దీనిని కూడా మారుస్తారని అనుకుంటున్నా అంటూ రిక్షావాలా చెబుతున్న మాటలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రిక్షావాల అయినా నిజమే చెప్పాడంటూ కితాబిస్తు్న్నారు. హ్యాట్సాప్ రిక్షావాలా అంటూ మరికొందరు కామెంట్ పెడుతున్నారు. ఏకంగా ప్రధాని మోదీకే సలహా ఇచ్చాడంటూ కొందరు కొనియాడుతున్నారు.