Samantha : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.. అందులో ‘ఖుషి’ సినిమా ఒకటి.. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”ఖుషి”. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు..
ముందు నుండి ఈ సినిమా మ్యూజికల్ గా బాగా రెస్పాన్స్ అందుకోవడంతో మ్యూజికల్ కాన్సర్ట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈ క్రమంలోనే నిన్న మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా అందులో విజయ్, సమంతతో పాటు మేకర్స్ మొత్తం పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకలో సిద్ శ్రీరామ్, చిన్మయితో పాటు ఇతర సింగర్స్ హేషమ్ అబ్దుల్ బృందం కూడా పాల్గొన్నారు.
అలాగే ఈ వేడుకకు సంగీత ప్రియులు, ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు.. మరి ఈ వేడుకలో సమంత గురించి చిన్మయి చేసిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది. ఆద్యంతం హుషారుగా తన పాటలతో ఫ్యాన్స్ ను హోరెత్తించిన చిన్మయి చివరిలో ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. సమంతపై తనకున్న ప్రేమ, అభిమానాన్ని ఈ వేదికపై మరోసారి చూపించి అందరిని ఆకట్టుకుంది..
ఈమె మాట్లాడుతూ.. సమంత నేను చాలా మందికి ఇన్స్పిరేషన్.. చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి.. చాలా ధైర్యవంతురాలు.. ఎవరు ఏమనుకున్నా సామ్ మానవతావాది.. సమంతను ప్రేమించే వారు ఎవ్వరైనా ఈ విషయాలే చెబుతారు అంటూ ఈమె తెలిపింది. చిన్మయి మాటలకూ పొంగిపోయిన సామ్ ఆమెను కౌగిలించుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మణిరత్నం అమృత సినిమాలోని ఏ దేవీ వరమో నీవు అనే పాట కూడా పాడి ఆకట్టుకుంది. ఈమెను పొగుడుతూ అక్కినేని ఫ్యామిలీని చైతూను టార్గెట్ చేసారనే టాక్ వస్తుంది..