Lakshmi Parvathi : ఎన్టీఆర్ రూ.100 నాణేం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవలు అందరూ హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ చనిపోయేనాటికి ఆయన భార్యగా చక్రం తిప్పిన లక్ష్మీపార్వతికి మాత్రం ఆహ్వానం దక్కలేదు.
అసలుపరోక్షంగా ఎన్టీఆర్ చావుకు ఈమెనే కారణమన్న అపవాదు ఉంది. ఈమె రాకతోనే నందమూరి కుటుంబాన్ని ఎన్టీఆర్ దూరం పెట్టడం.. ఎన్టీఆర్ ను డమ్మీని చేసి రాజకీయం చేసిందనే అపవాదు ఉంది. అందుకే చంద్రబాబును అందరూ ఎన్నుకొని టీడీపీని టేకోవర్ చేశారు.
అయితే ఇప్పటికీ లక్ష్మీపార్వతి తన భర్త పెట్టిన టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటారు. వైసీపీలో పదవి పొంది నాటకాలు ఆడుతుంటారు. జగన్ ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చినా మారు మాట్లాడలేదు.
మోడీతో లక్ష్మీపార్వతి ఇదివరకూ భేటి అయిన చిత్రాన్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
‘‘లక్ష్మీపార్వతి : కథ రాయమంటారా… జీవితచరిత్ర రాస్తా..
మోడీ: అబ్బే నాకొద్దు , ప్రత్తిపాడు నియోజకవర్గం,పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామం లోని మీ మొగుడు వీరగంధం సుబ్బారావు కథ రాయి..’’
అని అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇప్పుడు సెటైర్లు పేలుస్తున్నారు. సొంత మొగుడిని వదిలేసి ఎన్టీఆర్ పంచన చేరి మోసం చేసిన లక్ష్మీపార్వతి తీరును ఈ ఫొటోతో ఎండగడుతున్నారు.