Puri Jagannath Rathayatra : మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో దేని ప్రత్యేకత దానిదే. ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథ్ ఆలయంలో మనకు ఎన్నో వింతలు కనిపిస్తాయి. ఆలయ తీరు గురించి తెలిస్తే ఆశ్చర్యకరమే. ఇక్కడ ప్రతిదీ మిస్టరీయే. ఆలయంలో 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం ఉంది. దీనికి సంబంధించిన స్తంభాలు, గోడలు అన్ని ప్రత్యేకతమైనవే.
ఈ ఆలయ గోపురం జెండా ఉంటుంది. కానీ అది గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుంది. ఆలయం చాలా ఎత్తులో ఉంటుంది. గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. దాన్ని చూస్తే అది మనవైపే తిరిగినట్లు కనిపిస్తుంది. ఇక్కడ గాలి సాయంత్రం పూట భూమి నుంచి సముద్రం వైపు వీస్తుంది. పూరీలో మాత్రం భిన్నంగా వీయడం ప్రత్యేకత.
ఈ ఆలయంపైన పక్షులు ఎగరవు. దీనిపై పలు అధ్యయనాలు చేసినా రహస్యం అంతుచిక్కడం లేదు. ఆలయ గోపురం నీడ కనిపించదు. సూర్యుడు వచ్చినా అలా ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఆలయ మహిమనో మరేదో కారణం కావచ్చు. కానీ ఈ ఆలయ విశిష్టతలు తెలుసుకుంటే విచిత్రంగానే ఉంటాయి. దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి.
ఇక్కడ తయారు చేసిన ప్రసాదాన్ని వృథా చేయరు. ఎప్పుడు తయారు చేసిన వాసన రాదట. ప్రసాదం వితరణ చేసిన తరువాత వాసన రావడం గమనార్హం. పూరీ జగన్నాథ్ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. నది దగ్గర మూడు చెక్క పడవల్లో దేవతలను నది దాటిస్తారు.
పుర వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. రథయాత్రలో మూడు బంగారు చీపుర్లతో రథాల ముందు ఊడ్చుతారు. కృష్ణుడు, సుభద్ర విగ్రహాలను చెక్కతో చేస్తారు. రథం గుండిజాకు రాగానే దానంతట అదే ఆగిపోతుంది.