Increase Remuneration : తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య అందరికి సుపరిచితమే. పవన్ కల్యాణ్ తో ఖుషి సినిమా తీసి అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ స్టార్ హీరోగా ఎదిగాడు. పవన్ కల్యాణ్ కు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాగా ఖుషికి పేరుంది. అలాంటి సినిమాను తెరకెక్కించిన సూర్య తరువాత కాలంలో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేసినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయాడు.
దీంతో నటుడిగా, విలన్ గా కూడా పలు పాత్రలు చేశాడు. స్పైడర్ సినిమాలో విలన్ గా అలరించాడు. సినిమా హిట్ సాధించకపోయినా సూర్య నటనకు అందరు ఫిదా అయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ తో తీసిన కొమరం పులి డిజాస్టర్ కావడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి నటుడిగా విజయాలు దక్కించుకున్నాడు.
విజయ్ తీసిన వారసుడులో కూడా నటించాడు. తాజాగా విశాల్ మార్క్ ఆంటోని సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు. దీంతో తన పారితోషికం పెంచేశాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో జిగర్తాండ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఒక తెలుగు సినిమాలో నటించాలని కోరగా తన రెమ్యూనరేషన్ ఏకంగా రూ. 2 కోట్లు అని చెప్పడంతో కంగుతిన్నారు. అతడికి అంత పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వలేమని వేరే వారిని ఎంచుకున్నారట.
ఎస్జే సూర్య తన పారితోషికాన్ని పెద్ద మొత్తంలో పెంచడం సంచలనంగా మారింది. అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాలంటే ఇక నిర్మాత తల పట్టుకోవాల్సిందే. సూర్యను అడిగింది కూడా ఓ మీడియం సినిమాకే. పెద్ద సినిమాకు కూడా కాదు. కానీ ఆయన రేటు అలా చెప్పేసరికి అందరు ఆశ్చర్యపోయారట. దర్శకుడికంటే నటుడికే ఎక్కువ పారితోషికం ఉండటం గమనార్హం.