After Eating : భోజనం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో మనం తిన్న ఆహార పదార్థాలు త్వరగా అరగవు. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తలు తీసుకుంటే మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం కావడం సహజం.
తిన్న వెంటనే నిద్రపోవడం సురక్షితం కాదు. ఆహారం జీర్ణం కాకపోతే పోషకాహార లోపం తలెత్తుతుంది. పొగతాగడం, మద్యం తాగడం మంచి అలవాటు కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. భోజనం చేసిన వెంటనే వర్కౌట్లు, ఆటలు ఆడటం కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న తరువాత గ్యాస్, తేన్పుల వంటి సమస్యలు ఎదురవుతాయి.
మనం తినేటప్పుడు నీళ్లు తాగితే మన ఒంట్లో విడుదలయ్యే యాసిడ్లతో నీళ్లు కలిసి జీర్ణం కావడం ఆలస్యం చేస్తాయి. భోజనం చేశాక ఓ గంటన్నర ఆగి నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అందుకే భోజనం చేసే సందర్భంలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అనర్థదాయకమే అని గుర్తించుకుని జాగ్రత్తలు పాటించడం మంచిది.
ఇంకా కొందరు పండ్లు తిన్న తరువాత కూడా నీళ్లు తాగుతుంటారు. ఇది కూడా సరైనది కాదు. మన ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సమస్యలు రావడం గ్యారంటీ. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తిన్న పదార్థాలు జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది.