Tillu Square : విభిన్నమైన కంటెంట్ అందించడానికి సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ప్రతిభావంతులైన యువ దర్శకులకు ఎప్పుడూ అండగా ఉంటున్నాయి. స్టార్ బాయ్ జొన్నలగడ్డ సిద్ధుతో కలిసి డీజే టిల్లు తీశారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో డీజే టిల్లు క్యారెక్టర్ యూత్ ఆడియన్స్ లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. డిజే టిల్లు యువతలో పెద్ద క్రేజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా ‘ఈ ప్రశ్ననన్ను అడుగున్నావా రాధిక’ అంటూ మాట్లాడే తీరు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది.
దీపావళికి అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీ టీం పెద్దగా రివీల్ చేయడం లేదు. అయితే ప్రేక్షకులు తమ ఫేవరెట్ డీజేను మళ్లీ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెట్టింపు థ్రిల్స్, ఫ్రిల్స్ తో టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నటించనుందని, ఆమెకు, సిద్ధుకు మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. డీజే టిల్లు కంటే ఈ మూవీ మరింత అలరిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఇందులో ట్విస్ట్ లు టర్న్స్ తో డిఫరెంట్ పీల్ కలుగుతుందని చెప్తున్నారు. దీనితో పాటు ఎక్కడా కామెడీ మిస్ కాదని చెప్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.