Tillu Square : మార్చి 29న విడుదలైన స్క్వేర్ మూవీ రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ బాయ్ జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఈ సినిమాను ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది.
డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. టిల్లు స్క్వేర్ మూవీకి సిద్దు కథతో పాటు స్ర్కీన్ ప్లే కూడా అందించాడు. ఈ సినిమా విజయం సాధించడంతో మూడో పార్ట్ ‘టిల్లు క్యూబ్’ పేరుతో రాబోతుందని తెలుస్తోంది.