Teenmar Mallanna To Congress : మార్నింగ్ న్యూస్ తో కల్వకుంట్ల ఫ్యామిలీపై దుమ్మెత్తి పోసే తీన్మార్ మల్లన్న ఊహించినట్లుగానే ‘హస్తం’ గూటికి చేరారు. V6లో తీన్మార్ వార్తల్లో కనిపించిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై ఫైట్ చేయడం ప్రారంభించాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆయన పోషించిన పాత్ర అమోఘమైనది.
2015 నుంచి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి గెలుపొందారు. తర్వాత 2019 బైపోల్ లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో కూడా అదే ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా తీన్మార్ మల్లన్నను కొంత కాలంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు సంప్రదిస్తూ వస్తున్నారు. మొదట కేసీఆర్ పై కామారెడ్డి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన స్పందించలేదు. అయిలే ఈ రోజు (నవంబర్ 8) కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అబ్జర్వర్ బోస్ రాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీస్ సిప్పల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అయితే ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన ఐదింటిలో కొత్తగూడెం సీపీఐకి కేటాయించగా.. మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట, చార్మినార్ స్థానాలు ఉన్నాయి. అయితే వీటిలో మల్లన్నను ప్రకటించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనను ప్రస్తుతం స్టార్ కాంపెయినర్ గా వాడుకొని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక పదవులు ఇచ్చే చాన్స్ కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మల్లన్న కాంగ్రెస్ లోకి వెళ్లడంతో పార్టీకి మరింత జోష్ వచ్చిందనే చెప్పవచ్చు.