YS Sharmila : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కు పోలిక లేదు. వారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వైఎస్సార్ పరిపాలనలో ప్రజలకు దేవుడు. జగన్ మాత్రం అంతటి పేరు తెచ్చుకోలేదు. ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ కేడీగా ముద్ర పడుతున్నాడు. ప్రజలకు సేవ చేయడంలో వైఎస్సార్ ది ప్రత్యేక శైలి. కానీ జగన్ ది రౌడీయిజం, గుండాయిజం అని జగన్ చెల్లె షర్మిల దుమ్మెత్తి పోస్తోంది.
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారని విమర్శించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు జగన్ పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని వాపోతున్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టును వైఎస్ఆర్ 90 శాతం పూర్తి చేసినా కేవలం 10 శాతం పూర్తి చేయడానికి తంటాలు పడుతున్నారని విమర్శించారు.
గాలేరు నగరి ప్రాజెక్టును కూడా ఇంతవరకు యాభై శాతం కూడా పూర్తి చేయలేదు. తాను పాదయాత్ర ద్వారా జగన్ ను అధికారంలోకి తీసుకొస్తే కనీసం పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా అడుగుతున్నాను. ఒకసారి కాంగ్రెస్ కు కూడా అవకాశం ఇవ్వండంటూ వేడుకుంటోంది. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని వాపోయింది.
ప్రధానమంత్రి మోదీపై కూడా విమర్శలు ఎక్కుపెట్టింది. రామమందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారని గుర్తు చేశారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా కేడీనని విమర్శించారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలను కష్టాలకు గురిచేసే వైసీపీ పాలన పట్ల విసిగిపోయారని మండిపడ్డారు.