33.4 C
India
Friday, May 3, 2024
More

    Sharmila : వైఎస్సార్ కు జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది తెలుసా?

    Date:

    There is no comparison between YS Rajasekhar Reddy and Jagan
    There is no comparison between YS Rajasekhar Reddy and Jagan

    YS Sharmila : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కు పోలిక లేదు. వారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వైఎస్సార్ పరిపాలనలో ప్రజలకు దేవుడు. జగన్ మాత్రం అంతటి పేరు తెచ్చుకోలేదు. ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ కేడీగా ముద్ర పడుతున్నాడు. ప్రజలకు సేవ చేయడంలో వైఎస్సార్ ది ప్రత్యేక శైలి. కానీ జగన్ ది రౌడీయిజం, గుండాయిజం అని జగన్ చెల్లె షర్మిల దుమ్మెత్తి పోస్తోంది.

    రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారని విమర్శించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు జగన్ పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని వాపోతున్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టును వైఎస్ఆర్ 90 శాతం పూర్తి చేసినా కేవలం 10 శాతం పూర్తి చేయడానికి తంటాలు పడుతున్నారని విమర్శించారు.

    గాలేరు నగరి ప్రాజెక్టును కూడా ఇంతవరకు యాభై శాతం కూడా పూర్తి చేయలేదు. తాను పాదయాత్ర ద్వారా జగన్ ను అధికారంలోకి తీసుకొస్తే కనీసం పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా అడుగుతున్నాను. ఒకసారి కాంగ్రెస్ కు కూడా అవకాశం ఇవ్వండంటూ వేడుకుంటోంది. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని వాపోయింది.

    ప్రధానమంత్రి మోదీపై కూడా విమర్శలు ఎక్కుపెట్టింది. రామమందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారని గుర్తు చేశారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా కేడీనని విమర్శించారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలను కష్టాలకు గురిచేసే వైసీపీ పాలన పట్ల విసిగిపోయారని మండిపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...