Sreemanthudu : మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా శ్రీమంతుడు. అది ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాపై అప్పట్లోనే వివాదం ఏర్పడింది. శ్రీమంతుడు సినిమా కాపీ అని స్వాతి పత్రికలో వచ్చిన కథను కాపీ చేసి సినిమా తీశారని కోర్టుకెక్కాడు. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. దీంతో దర్శకుడు శివకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
నాంపల్లి కోర్టులో కొరటాల శివపై చర్యలు తీసుకోవాలని రచయిత శరత్ కేసు వేయడంతో ముందుకెళ్లింది. అక్కడ నుంచి హైకోర్టుకు తరువాత సుప్రీంకోర్టుకు చేరింది. రచయిత శరత్ కు రూ. 15 లక్షల నష్టపరిహారం ఇస్తానని అప్పట్లోనే శివ ఒప్పుకున్నా శరత్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తనకు డబ్బు అక్కర్లేదని సమాధానం ఇచ్చాడు.
ఇప్పుడు ఏం చేయాలో దర్శకుడికి అర్థం కావడం లేదు. నాకు డబ్బు అవసరం లేదు కథ నాదే అని ఒప్పుకుంటే చాలని శరత్ అంటున్నాడు. కథ తనదే అని ఒప్పుకుంటే తన కెరీర్ నాశనం అవుతుందని శివ వాదన. తనను కాపీ కొట్టేవాడిగా ముద్ర వేస్తారని భయపడుతున్నాడు. అందుకు కొరటాల శివ మనసు అంగీకరించడం లేదు.
సినిమా వచ్చి ఎన్నో ఏళ్లయినా దాని గురించి ఇంకా ఇద్దరు కొట్టుకోవడం గమనార్హం. సినిమా క్రెడిట్ కోసం ఓ రచయిత ఇంత కష్టపడుతుండటంపై అనుమానాలు వస్తున్నాయి. సినిమా నిజంగానే కాపీ కొట్టారా? లేక అదంతా పుకారా? అనేది తేలడం లేదు. దీంతో శ్రీమంతుడు సినిమా విషయంలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా తేలేలా కనిపించడం లేదు.