Reduce heat : ఎండాకాలంలో విపరీతంగా దంచి కొడుతున్నాయి. విపరీతమైన చెమట పడుతుంది. ఒంట్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కడుపులో సమస్యలు వస్తుంటాయి. ఇందులో పేగు సమస్యలు ప్రధానమైనవి. తలనొప్పి, మొటిమలు, అతిసారం, యూటీఐ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. దీంతో వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోవాల్సిందే.
అరటిగుజ్జు రసం తాగితే ఎంతో మంచిది. అరటిపండు గుజ్జులో ఎసెన్జిలా అనే పోషకాలు ఉంటాయి. దీంతో ఎండాకాలంలో శరీరంలో మంటలు రావడం సహజమే. దీంతో రోజువారీ ఆహారంలో అరటిని చేర్చుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. షుగర్ పేషెంట్లకు మరీ మంచిది. దీంతో అరటి గుజ్జు రసం తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో పిత్త దోషాలు ఏర్పడతాయి. రాత్రి పడుకునే ముందు గుల్కండ్ పాలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మంచి నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. చెరుకు రసం వల్ల కూడా మన శరీరం చల్లగా మారుతుంది. అందులో ఉండే పోషకాలు మనకు ఎంతో మేలు కలిగిస్తాయి. ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. అందుకే చెరుకు రసంను తాగితే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.
మూత్రంలో మంట రాకుండా ఉండాలంటే కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం చల్లగా అవుతుంది. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగితే ఎంతో మంచిది. మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా శరీరం కూల్ గా మారుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. రోజు మజ్జిగ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.