36.5 C
India
Friday, April 10, 2026
More

    నిద్రలేమి సమస్యలను ఆ పానీయాలే దూరం చేస్తాయి

    Date:

    sleeplessness
    sleeplessness

    ప్రస్తుత కాలంలో నిద్ర లేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అర్థరాత్రి అయినా నిద్ర పట్టక పక్క అటు ఇటు పొర్లిస్తూ నిద్ర కోసం వేదన పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నిద్ర పట్టేందుకు ఏ మందులు వాడాలో కూడా తెలియడం లేదు. కానీ మన ఆహారాలే మనకు నిద్ర దూరం చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో నిద్రలేమిని దూరం చేసుకునే కొన్ని పానీయాల గురించి తెలుసుకుంటే సరి.

    మనకు మంచి నిద్ర పట్టాలంటే అశ్వగంధ చూర్ణం బాగా పనిచేస్తోంది. రాత్రి సమయంలో పాలలో ఈ చూర్ణం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి దూరం కావొచ్చు. బాదం పొడి పాలలో కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా నిద్రలేమి సమస్యలనుంచి తప్పించుకునేందుకు వీటిని తాగితే ఫలితం ఉంటుంది.

    పాలతో తేనె కలుపుకుని తాగితే కూడా మంచి నిద్ర పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అరటిపండు ఆల్మండ్ బటర్ కూడా సుఖమైన నిద్ర పట్టేందుకు మంచి మార్గం ఉంటుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు అరటిపండు ముక్కలు ఆల్మండ్ బటర్, పాలు కలుపుకుని మిక్సీ పట్టుకుని తాగడం వల్ల మంచి నిద్ర మన సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా వచ్చేందుకు ఇవి సాయపడతాయి.

    పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ద్రాక్ష రసం తాగడం వల్ల కూడా మనకు చక్కని నిద్ర సాధ్యమవుతుంది. ఇందులో ఉండే మెలటోనిన్ అనే హార్మోన్ మనకు నిద్ర పట్టేలా చేస్తుంది. ఇంకా చామంతి టీ కూడా మనకు గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. ఇలా ఇన్ని రకాల పానీయాలు మన నిద్ర లేమి సమస్యలను దూరం చేస్తాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WHO : కల్తీ పాల కారణంగా 2025 నాటికి 87శాతం మంది భారతీయులకు క్యాన్సర్ ముప్పు

    WHO : టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ...

    Good Sleep : మహిళలు సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క!

    Good Sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరానికి సరైన...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...