ఈరోజుల్లో మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు ప్రతీ ఇంట్లో ఉన్నారు. దానికి వయసు బేధం కూడా లేదు. ఇటీవల కాలంలో చిన్న వాళ్ళు సైతం మధుమేహం బారిన పడుతున్నారు. ఇక అది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం కష్టం. దీర్ఘకాలిక వ్యాధి కావడంతో బ్రతికినన్నాళ్ళు దాంతో సహజీవనం చేయాల్సిందే. అయితే మధుమేహం వచ్చింది అని బాధపడకుండా దాన్ని కంట్రోల్ చేసే మార్గం ఉంది. ఆ చిట్కా పాటిస్తే మధుమేహాన్ని కంట్రోల్ చేయోచ్చు.
దానికి ఏం చేయాలో తెలుసా ……. నిమ్మ కాయ తొక్కలను తీసుకొని వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ నిమ్మకాయ తొక్కల పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతీ రోజు ఉదయం అర టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. ఇలా ప్రతీ రోజు పరగడుపున చేయడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది.
ఈ చిట్కా మీరు పాటించడమే కాకుండా మీ కుటుంబంలో ఉన్న మధుమేహ వ్యాధి గ్రస్తులకు తెలియజేస్తే ప్రయోజనకారిగా ఉంటుంది. మధుమేహం ఉన్న వాళ్లకు కూడా ఈ విషయం తెలియజేయండి.