Farmers : ఏపీలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచించి. కోత దశకు వరి, వడ్లు పూర్తిగా తడిసి పోయాయి. తడిసిన వడ్లు మొలకెత్తాయి. తడిసిన ధాన్యం కేంద్రాల వద్దకు వచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వడ్లు మొలకెత్తాయి సారు ఆదుకోండి అంటూ వేడుకున్నారు. అయితే మంత్రిని అన్న విచక్షన మరిచి ఒక గౌరవపదమైన పదవిలో ఉన్నానని కూడా మరిచి నేనేం చేస్తానురా ఎర్రిపప్పా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఓవైపు అకాల వర్షాలతో రైతులు అరుగాలం పండించిన పంట నష్టపోయారు. ప్రభుత్వం అచేతనంగా మారింది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి మనోధైర్యం చెప్పిన నేత లేదు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అని ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేసిన పాపాన పోలేదు.. కాగా రైతులకు మంత్రుల నుంచి చీవాట్లు… రైతు సంక్షేమం అని చెప్పుకునే జగన్ కు రైతులు కనిపించడం లేదు.
ఓట్ల కోసం వచ్చి బ్రతిమిలాడే నాయకులు, వాళ్ల ఓటేసి గెలిపిస్తే గెలిచి, ఎమ్మెల్యేగా, మంత్రిగా చలామణి అవుతున్న మంత్రికి అసలు ఈ మంత్రి పదవి ఏలా వచ్చిందో మర్చిపోవడం కన్నా ఎర్రితనం ఉంటుందా.. ఎపీలో మంత్రి పదవి అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి అన్నట్లు ఉంది. దందాలు చేయడానికి, దోపీడీలు చేయడానికి కాదు.. రాజకీయాల్లోకి వచ్చింది అని గ్రహించాలి కారుమూరి నాగేశ్వరరావు. మంత్రి పదవి అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వల్ల సాధ్యం కాకపోతే సీఎం కు చెప్పి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాలి. అసలు పరిష్కరించకుంటే కనీస సమస్యలు వినే ఓపిక ఉండాలి కదా… అని చర్చించుకుంటున్నారు.