ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు బీజేపీ శ్రేణులు. కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ ధియోధర్ , జాతీయ కార్యదర్శి సత్యకుమార్ , మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం తదితరులు.
ఈ సందర్భంగా UBllod App డైరీని కిరణ్ కుమార్ రెడ్డికి అందించారు పాతురి. తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చిన నాయకులకు , కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీ అభివృద్ధి కోసం, పార్టీ అధికారంలోకి రావడం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.