30.1 C
India
Wednesday, April 30, 2025
More

    సికింద్రాబాద్ రూబీ లాడ్జీ లో ఘోర అగ్నిప్రమాదం

    Date:

    a-terrible-fire-broke-out-at-ruby-lodge-in-secunderabad
    a-terrible-fire-broke-out-at-ruby-lodge-in-secunderabad

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ లాడ్జీ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దారుణ సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

    సంఘటనా వివరాలలోకి వెళితే ……. సికింద్రాబాద్ లో రూబీ లాడ్జీ నిర్వహిస్తున్నాడు రంజిత్ సింగ్ బగ్గా. ఇదే లాడ్జీ సెల్లార్ లో నిబంధనలకు విరుద్దంగా ఎలక్ట్రిక్ బైక్ షోరూం నిర్వహిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో చెలరేగిన మంటలతో పొగ దట్టంగా అలుముకుంది. దాంతో పైన లాడ్జీలో ఉన్న 25 మంది వరకు ఊపిరాడక కొంతమంది అందులోనే చనిపోయారు. మరికొంతమందికి మంటలు అంటుకున్నాయి. ఇక మిగతా మంది ప్రాణాలు దక్కించుకోవడానికి కిందకు దూకారు. అలా దూకిన వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

    లాడ్జీ ప్రమాదంలో మరణించిన సంఘటన ప్రధాని నరేంద్ర మోడీని కలవరపరిచింది. మృతులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేసిన ప్రధాని రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

    Share post:

    More like this
    Related

    Pahalgam : పహల్గాం దాడిలో పాక్ మాజీ కమాండో.. దారుణం

    Pahalgam : పాకిస్థాన్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న అనుబంధాన్ని...

    Vikrant : పాక్‌కు చుక్కలు చూపిస్తున్న విక్రాంత్!

    Vikrant : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం సముద్రంలో దూకుడుగా చర్యలు...

    Pakistan : భారత్ షాక్‌కు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

    Pakistan PM : ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related