కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక ఖాయమని తెలుస్తోంది. ప్రియాంకా గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరికకు రంగం సిద్ధమైంది. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగారు. అయితే తెలంగాణ ఉద్యమంలో జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాడు.
ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. అయితే క్రియాశీల రాజకీయాల్లో కంటే వ్యాపారాల్లో ఎక్కువగా పాల్గొనేవాడు. కట్ చేస్తే 2014 లో ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేసి విజయం సాధించాడు. గత కొంత కాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరూ బీజేపీ లో చేరాలా ? కాంగ్రెస్ పార్టీలో చేరాలా ? లేక సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలా ? అనే తీవ్ర తర్జన భర్జన పడ్డారు.
అయితే కార్యకర్తల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దాంతో త్వరలోనే ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. ఈ ఇద్దరి చేరికతో ఖమ్మం , మహబూబ్ నగర్ లలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుంది.