Congress Tickets : తెలంగాణ కాంగ్రెస్ ఈసారి గెలుపునే ధ్యేయంగా ముందుకెళుతోంది. బీఆర్ఎస్ ను ఓడించి అధికారం చేపట్టాలని ప్రజల్లోకి వెళుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఈసారి అదే నినాదంతో వెళుతోంది. ఈ క్రమంలోనే బలమైన రెడ్డి నేతలను ఓన్ చేసుకుంటోంది.అందరినీ ఏకతాటిపైకి తెస్తోంది.
ఖమ్మంలో బీఆర్ఎస్ ను వ్యతిరేకించి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లో చేర్చుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారికి తగ్గట్టుగా సీట్ల కేటాయింపులోనూ స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ లో ఉండగా పాలేరు నుంచి బరిలోకి దిగిన తుమ్మలకు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఖమ్మం సీటును ఇవ్వగా.. బలమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి పాలేరు అసెంబ్లీ సీటును పికప్ చేసుకున్నారు. రెడ్డి సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుఫున కూడా రెడ్డి ఎమ్మెల్యే అయిన కందాల ఉపేందర్ రెడ్డినే నిలబడుతున్నారు. పోయిన సారి ఆయన కాంగ్రెస్ నుంచే గెలిచారు. అందుకే పొంగులేటి ఎంట్రీతో ఈసారి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
పాలేరులో ఈసారి షర్మిల కూడా పోటీచేయడానికి రెడీ అయ్యింది. దీంతో త్రిముఖ పోరు అనివార్యంగా మారింది. వీరిలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.