LokSabha Elections 2024 : తొలి విడత జరుగుతున్న రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మణిపూర్ లోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో కాల్పులు వినిపించాయి. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఓటర్లు అటు ఇటు పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
మణిపూర్ లో ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో అక్కడ బిజెపి కూటమి విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. బిజెపి ఏజెంట్ ను టీఎంసీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారని బిజెపి ఆరోపించింది. మేదినీపూర్ నియోజకవర్గంలో రాళ్లదాడులు జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తన్నాయి.
కూచ్ బెహర్ లో పలు ఘటనల్లో ఇరువర్గాల కార్యకర్తలు గాయపడ్డారు. ఓ గ్రామంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బిజెపి కార్యాలయంలో ఆయుధాలను దాచిపెట్టారని టీఎంసీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తొలి విడత పోలింగ్ లో బెంగాల్ నుంచి ఈసీకి 100కు పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
Incidents of booth capturing and violence emerge from Inner Manipur constituency that goes to poll today.
Video below shows armed men walking near a polling booth as police look on, women appear to be pleading police to take action. pic.twitter.com/2Ooo2szO6M— Vijaita Singh (@vijaita) April 19, 2024