ఐపీల్ 2023 లో సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. చివరి బంతి వరకు గెలుపోటములు నువ్వా – నేనా అన్నట్లుగా సాగుతుండటంతో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కన్నీళ్ల పర్యంతం అయ్యేవాళ్ళు కొందరైతే సంతోషంతో ఉప్పొంగిపోయేవాళ్లు మరికొందరు. నిన్న బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో RCB vs LSG తలపడగా మ్యాచ్ చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మొదటి బ్యాటింగ్ చేసిన RCB పరుగుల వరద పారించింది. 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటవ్వగా డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 79 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మ్యాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్లతో 59 పరుగులు చేసాడు.
213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. కష్టాల్లో ఉన్న లక్నో జట్టును స్టోయినీస్ 30 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఇక అదే ఊపులో విండీస్ కు చెందిన నికోలస్ పూరన్ ఊచకోత కోశాడు. 15 బంతుల్లోనే 51 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 18 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో బదానీ 30 పరుగులు చేయడంతో గెలుపు అంచున చేరింది. అయితే సిక్స్ కొట్టి స్టంప్స్ కు బ్యాట్ తగిలించడంతో ఔటయ్యాడు. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బై రన్ రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.