RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్స్ ఏ జట్టుకు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ 16వ ఎడిషన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి ప్లే ఆప్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ వచ్చే ఏడు మ్యాచ్ లు గెలిచినా కూడా ఆ టీం పాయింట్స్ 14 మాత్రమే అవుతాయి. మిగతా జట్ల రన్ రేట్ తో మాత్రమే పోటీపడి ప్లే ఆప్స్ కు వెళ్లాల్సి ఉంటుంది.
విరాట్ కోహ్లీ ఒక్కడే భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అటు ఫినిషింగ్లో దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ఇప్పుడిప్పుడే డూప్లేసెస్ ఫామ్ లోకి వచ్చాడు. కానీ బౌలర్లు ఏ మాత్రం రాణిిిించడం లేదు. దీంతో బెంగళూరు గెలవడం కష్టంగా మారుతుంది. బౌలింగ్ విభాగంలో సరైన స్పిన్నర్ లేడు. ఫేస్ బౌలర్లు తేలిపోతున్నారు. టాప్లీ, పెర్గూసన్, సిరాజ్, వైశాఖ్ అందరూ విఫలమవుతున్నారు.
దీంతో బెంగళూరుకు రాబోయే 7 మ్యాచ్ లు కీలకం కానున్నాయి. విరాట్ కొహ్లీ మాత్రం చాలా నర్వస్ గా కనిపిస్తున్నాడు. ఎంత రాణిిించినా తోటి ప్లేయర్లు ఆడకపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో అయితే బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడారు. దీంతో ఐపీఎల్ లో 287 పరుగుల భారీ స్కోరు నమోదైంది. ఇదే ఇప్పటిి వరకు ఐపీఎల్ లో అత్యధిక స్కోరు..
బెంగళూరు బ్యాటింగ్ లో పర్వాలేదనిపించింది. 262 పరుగులు చేజింగ్ చేసి పోరాట స్ఫూర్తి కనబరిచింది. అయితే ఈ సారి కింద నుంచి మొదటి స్థానంలో మాత్రం ఉండేలా అనిపిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ ఇలా వెనకంజ లో ఉన్నాయి. మిగతా టీంలు ప్లే ఆప్ రేసులోనే ఉన్నాయి. ఈ సారి మాత్రం బెంగళూరు ప్లే ఆప్స్ చేరడం అనే విషయాన్ని ఆ టీం అభిమానులు మరిచిపోవాల్సిందే. ఈ సాల కప్ నామ్ దే అనుకుంటూ 2017 సీజన్ వరకు వేచి చూడాల్సిందే.