Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చతికిలపడుతున్నది. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది పరాజయాల్లోనూ సరికొత్త రికార్డును చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన హైస్కోరింగ్ గేమ్లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
వరుస ఓటములతో అధ్వాన్నపు ఆటతీరును ప్రదర్శిస్తున్న ఆర్సీబీపై కర్ణాటకకు చెందిన భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆట తీరుతో ఐపీఎల్ సీజన్లో చివరి వరకూ నిలవలేరంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆర్సీబీని కొత్త ఓనర్లకు అమ్మేయాలని బీసీసీఐకి సూచించాడు.
స్పోర్ట్స్, ఐపీఎల్, క్రీడాభిమానుల కోసం బీసీసీఐ తక్షణమే ఈ ఫ్రాంఛైజీని కొత్త వారికి విక్రయించాలని అన్నాడు. అప్పుడైనా కొత్త మేనేజ్మెంట్ జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై శ్రద్ధ చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆడుతున్న మిగిలిన జట్లలాగా పోటీతత్వంతో ఆడేలా తయారు చేయగలుగుతుందని పేర్కొన్నాడు.
కోహ్లీలోనూ అదే బాధ
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లిని టీమ్ అపజయాలు కుందీస్తున్నాయి. జట్టు విజయం సాధించడం లేదన్న బాధ స్పష్టంగా కనిపిస్తున్నది. బౌలర్లు పరుగులు ఇస్తుండడంతో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. గ్రౌండ్ లో పట్టరాని కోపంతో ఊగిపోతున్నాడు. ప్లేయర్స్ పై అరుస్తున్నాడు. అంతలోనే ధీర్ఘాలోచనలో పడుతుండడం మ్యాచ్ చూస్తున్నంత సేపు గమనించవచ్చు.
వ్యక్తిగతంగా బ్యాటింగ్ తానెంత రాణిస్తున్న బాలర్లు మాత్రం పరుగులు కట్టడి చేయడంలో దారుణంగా విఫలవుతున్నారు. బౌలర్లు దారాళంగా పరుగులు ఇస్తుండడంతో కోహ్లీ తన కోపాన్ని అణుచుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ భారమంతా కోహ్లి తన భుజస్కందాలపై మోస్తున్నాడు. కోహ్లి ఎంత కష్టపడినా తన శ్రమ అంతా వృథానే అవుతున్నది.
బౌలర్ల వైఫల్యం
బ్యాటింగ్ లైనప్ బాగున్నా, చేజింగ్ ధారాళంగా పరుగులు పారిస్తున్న ఆర్సీబీ బౌలింగ్ లైనప్ మాత్రం మైనస్ గా మారుతున్నది. బౌలర్లు కట్టడి చేస్తే తప్ప జట్టు విజయం సాధించడం సాధ్యం కాదు.