ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. సంక్షేమ పథకాలు గాలికొదిలేశారు. డెవలప్ మెంట్ కనిపించడం లేదు. రోడ్లు అధ్వానంగా మారాయి. ఏ ఒక్క పని కూడా చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేందుకు ఆనవాళ్లు కనిపించడం లేదు. దీంతో పాలన గాడితప్పింది. దీనిపై ఉయ్యాల పాట విడుదల చేశారు. వైసీపీ నిర్వాకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
జగన్ ఇచ్చిన హామీలన్ని నీటిమూటయ్యాయి. రుణమాఫీ జాడేలేదు. అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ చేసిన పనులు ఏమీ లేకపోవడం విడ్డూరం. దీంతో వైసీపీ నాలుగేళ్ల పాలన నవ్వులపాలవుతోంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఏ రంగం చూసినా నిర్వీర్యమే. పనుల్లో పారదర్శకత లేదు. గిట్టుబాటు ధరలు గట్టెక్కాయి. రైతులకు నష్టాలే స్వాగతం చెబుతున్నాయి.
అరకొర నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఉయ్యాల పాట రూపంలో వారు చూపించినవి కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు పడుతున్న బాధలు వారికి పట్టడం లేదు. జగన్ తీరుతో అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీలకు అడ్డాలుగా మారుతున్నాయి. భూములను కబ్జా చేస్తున్నారు. ఎదురొచ్చిన వారిని హతమారుస్తున్నారు.
వైసీపీ నేతలు రౌడీల్లా మారుతున్నారు. రాష్ట్రమే రావణకాష్టంలా రగులుతోంది. సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. కానీ జగన్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. జగన్ పాలనకు ఇక రోజులు దగ్గర పడ్డాయి. భవిష్యత్ లో వైసీపీకి చరమగీతం పాడి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి. జగన్ పాలనను బతుకమ్మ పాటలో ఏకిపారేశారు.