సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ఓ వీడియో విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు పేరుతో తయారు చేసిన వీడియో గమ్మత్తుగా ఉంది. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇదివరకే వస్తున్న ఊహాగానాలకు ప్రతిరూపంగా దీన్ని తీసుకొచ్చారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని కొన్ని గద్దలు పీక్కుతింటున్నాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంతో రెండు పార్టీలు పెళ్లి చేసుకుంటున్నాయని వీడియోలో చూపించారు. దీనికి బీజేపీ బీఆర్ఎస్ కు నజరానాలు ఇస్తోంది. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ కాకుండా తాయిలాలు ప్రకటించింది. దీంతో ఆమె అరెస్టు వ్యవహారం అటకెక్కింది.
దీంతో రెండు పార్టీల మధ్య మంచి ఒప్పందం కుదిరింది. దీంతోనే వారు బయట శత్రువులు లోపల మిత్రులు అని కాంగ్రెస్ పార్టీ నిందిస్తోంది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీలు ఒకటేననే వాదనలు వస్తుండటం గమనార్హం. ఈనేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక తాను ముక్కలే అనే విమర్శలు రావడం సహజమే. ఎన్నోమార్లు బీజేపీ నేతలు బీఆర్ఎస్ ను విమర్శించినా కవితను మాత్రం ఎందుకు అరెస్టు చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు కాకుండా ఆపింది కూడా బీజేపీనే అని కొందరి వాదన. ఈ నేపథ్యంలో రెండు పార్టీల పెళ్లి అంటూ కార్డులు కొట్టించి మరీ ప్రచారం చేయడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ తాయిలాలు పొందుతోంది. బీజేపీ అందిస్తోంది. ఇలా ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందంతోనే వారి వివాహ బంధం అంటూ చెబుతున్నారు.