Maheshbabu మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఆదినుంచి అవాంతరాలే దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్ సజావుగా సాగడం లేదు. ఎప్పుడు ఏదో అడ్డు తగులుతూనే ఉంది. దీంతో సినిమా ముందుకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి విడుదల ఏమో కానీ సినిమా షూటింగ్ నడవడమే కష్టంగా మారింది.
సినిమాలో పూజా హెగ్డేకు సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో తాను ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సమయానికి పాటలు ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక దశలో థమన్ ను పక్కన పెట్టేశారనే వదంతులు కూడా వచ్చాయి. తాజాగా సినిమా ఫొటోగ్రాఫర్ వినోద్ గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
దీంతో రెండు అడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈనేపథ్యంలో గుంటూరు కారం సినిమా పట్టాలెక్కడం కష్టమేనా అనే సందేహాలు వస్తున్నాయి. మరో ఫొటోగ్రాఫర్ కోసం త్రివిక్రమ్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు మాత్రం ప్ర్తస్తుతం లండన్ లో ఉన్నారు. గుంటూరు కారం సినిమా ఎన్నో పల్టీలు కొడుతోంది. కానీ పట్టాలు మాత్రం ఎక్కడం లేదు.
అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు గుంటూరు కారం సినిమా పట్టాలెక్కుతుందా? ఇన్ని అవాంతరాల మధ్య షూటింగ్ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. త్రివిక్రమ్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అతడు, ఖలేజా సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చినా ఖలేజా డిజాస్టర్ గా మిగిలింది. అతడు మాత్రం ఫర్వాలేదనిపించినా సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందో లేదో చూద్దామనుకుంటే అది కూడా సాధ్యమవుతుందో లేదో తెలియడం లేదు.